బిల్లును భోగి మంటల్లో తగలబెడతాం !

t billఈ నెల 17, 18 తేదీల్లో సీమాంధ్ర బంద్ కు పిలుపునిస్తున్నట్టు ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. ఈ నెల 20న అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పారు. తెలంగాణ బిల్లును భోగి మంటల్లో తగులబెట్టే కార్యక్రమాన్ని ఈ నెల 13న నిర్వహిస్తామని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీల సహాయ సహకారాలతో ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వబోమని నేతలు ప్రజల సమక్షంలో హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ వాయిదా పడకుండా చూడాల్సిన బాధ్యత సభ్యులదేనని అశోక్ బాబు అన్నారు. అసెంబ్లీలో టీబిల్లుపై చర్చించాలని, ఓటింగ్ సమయంలో ఓడించాలని అన్నారు.