Site icon TeluguMirchi.com

ఏపీఎన్జీవోల అఖిలపక్షం భేటీ!

ap ngo'sఏపీఎన్జీవోల ఆధ్వర్యంలో ఈరోజు(శనివారం) ఉదయం ఏపీఎన్జీవో భవన్‌ లో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి దాదాపు అన్ని పార్టీలకు నుంచి సీమాంధ్ర నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా.. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ జరగనున్న నేపథ్యంలో అనుసరించాల్సి వ్యూహంపై చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. భవిష్యత్‌ లో రాజకీయపార్టీలతో కలిసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే అంశంపై కూడా నేతలు సమాలోచనలు జరిపారు. ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు అధ్యక్షత జరిగిన ఈ అఖిలపక్ష సమావేశానికి సుజనాచౌదరి, పయ్యావుల కేశవ్, కొనకళ్ల, కేఈ. ప్రభాకర్, సబ్బంహరి, శైలజానాథ్, వైవీరావు, కటారి శ్రీనివాస్, సీమాంధ్రలోని అన్ని ఉద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు.

Exit mobile version