టీ-బిల్లు అసెంబ్లీకి వస్తే.. అసెంబ్లీని ముట్టడిస్తాం.. అని హెచ్చరించిన ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు మాటలు కార్యరూపం దాల్చలేదు. పైగా.. ఏపీ ఏన్జీవోలలో విబేధాలు బగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో.. ఇటీవల అఖిలపక్షం సమావేశమంటూ.. కొత్త దారికి తెరలేపారు ఉద్యోగులు. తాజాగా, ఈరోజు ఏపీ భవన్ లో మరోసారి అఖిలపక్ష సమావేశం జరగనుంది. జనవరి 3నుంచి చేపట్టాల్సిన కార్యచరణను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు.
అఖిలపక్ష భేటీలో ఖరారు చేయనున్న కార్యాచరణ ఎలా వుండబోతోంది. ఇప్పటికే టీ-బిల్లుపై అసెంబ్లీలో చర్చ కూడా ప్రారంభమైన నేపథ్యంలో.. రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచేందుకు ఏపీ ఎన్జీవోల కార్యచరణ ఎంత వరకు ఉపయోగపడుతుంది.. అనే విషయాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.