Site icon TeluguMirchi.com

గవర్నర్ తో సీఎం వైఎస్ జగన్ కీలక సమావేశం

 

ఈరోజు ఏపీకి వెళ్లిన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో సీఎం వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. విజయవాడలో ఉన్న గవర్నర్ నరసింహన్‌తో కీలక చర్చలు జరిపారు. గవర్నర్‌ బస చేసిన గేట్‌వే హోటల్‌కు వెళ్లి ఆయనతో సమావేశమైన సీఎం జగన్.. దాదాపు 45 నిమిషాల పాటు పలు కీలక అంశాలపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది. విభజన సమస్యలపై వీరి భేటీలో ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం అందుతుంది.

అయితే తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం తర్వాత.. గవర్నర్‌ను ఏపీ సీఎం కలవడంపై ఆసక్తి నెలకుంది.  షెడ్యూల్-9,10 సంస్ధల ఆస్తుల విభజనపై చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. అలాగే… దామాషా పద్ధతిన ఆస్తుల పంపకం జరగాలని సీఎం వైఎస్ జగన్ కోరినట్టుగా కూడా  తెలుస్తోంది. అంతేకాకుండా నీటి పంపకాల విషయంలో ఉన్న సమస్యలను పరిష్కరించే అంశంపై కూడా చర్చించుకున్నట్లు  సమాచారం. అలాగే.. త్వరలోనే ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండడంతో.. బడ్జెట్‌లో పొందుపర్చిన పథకాలు. కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉన్న ఆర్థికపరమైన అంశాలపై గవర్నర్‌తో సీఎం వైఎస్ జగన్ చర్చలు జరిపినట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం.

 

Exit mobile version