రాష్ట్ర విభజనకు అధికార, విపక్ష పార్టీలు కలిసి కుట్ర పన్నాయని వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ శాసనసభలో ఆరోపించారు. విభజన బిల్లుపై సభలో చర్చ నేపథ్యంలో మాట్లాడిన ఆమె.. విభజనను అడ్డుకోవడమే తమ లక్ష్యమని, దానికి వ్యతిరేకంగా తమ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేస్తామని అన్నారు. సమైక్యం తమ విధానమని.. విభజనకు వ్యతిరేకమని స్పష్టం చేశారు.
బిల్లుపై శాసనసభలో చర్చను వ్యతిరేకిస్తూ పలుమార్లు సభనుంచి వైఎస్సార్సీపీ నేతలు వాకౌట్ చేయడాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తప్పుబట్టారు. చర్చలో పాల్గొనకుండా ఇష్టం వచ్చినన్ని సార్లు సభనుంచి వెళ్లడం సరైన చర్య కాదన్నారు.
బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం: శైలజానాధ్
సిగ్గుంటే రాజీనామా చేయండి : ఎర్రబెల్లి
మీ చావు మీరు చావండి అంటున్నారు : జూలకంటి
టీడీపీ నేత పయ్యావుల కేశవ్ పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. నాటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తెలంగాణ వాదానికి బీజం వేస్తే… ఇప్పటి వైఎస్సార్సీపీ సభ్యులు రాష్ట్రం విడిపోవాలని కోరుకుంటున్నారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ సభ్యులు బయట ఒక విధంగా, సభలో మరో విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. చర్చ నుంచి తప్పించుకోవడానికి, ఓటింగ్ లో పాల్గొనకుండా ఉండేందుకు… వైకాపా ఎమ్మెల్యేలు సభనుంచి వాకౌట్ చేస్తున్నారని అన్నారు.
అంతకు ముందు మాట్లాడిన కేటీఅర్.. టీఆర్ఎస్ పుట్టకముందే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజం వేసింది దివంగత రాజశేఖర్ రెడ్డే అని తెలిపారు. 42 మందితో కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వినతి పత్రం ఇప్పించింది వైయస్సే అని అన్నారు. మాతోనే తెలంగాణ వస్తుందని వైయస్ ఒకటికి పదిసార్లు చెప్పారని గుర్తుచేశారు. వైయస్ కల ఇప్పుడు నెరవేరుతున్నందుకు వైఎస్సార్సీపీ సంతోషించాలని అన్నారు. ఓటింగ్ పేరుతో వైఎస్సార్సీపీ డ్రామాలు చేస్తోందని ఆరోపించారు.