రేపటి నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే విషయంపై చర్చ జరుగోతోంది. అసెంబ్లీ సమావేశాల షార్ట్ డిస్కషన్ లో కరువుపై చర్చించాలని టీడీపీ కోరనుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే రెండు కీలక బిల్లులు సభలో ప్రవేశ పెట్టనున్నారు. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకు కల్పించే దిశగా చట్టాన్ని తెచ్చేందుకు ఉద్దేశించిన బిల్లుపై సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే అధికారులతో చర్చించారు. ఇక మంత్రివర్గంలో 60 శాతం పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అవకాశం కల్పించిన ప్రభుత్వం ఇప్పుడు ఆ వర్గాలకు నామినేషన్ పదవులు, ఐదు లక్షల రూపాయలలోపు నామినేషన్ పనుల్లో 50 శాతం కల్పిస్తూ చట్టబద్ధత కల్పించనుంది.