Site icon TeluguMirchi.com

హైదరాబాద్ కు ఆంటోని కమిటీ

Kavuriసీమాంధ్రుల ఆందోళనలో న్యాయముందని కేంద్ర మంత్రి కావూరి సాంబశిరావు అన్నారు. కావూరి ఈరోజు ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. విభజన విషయంలో తలెత్తె సమస్యలు, సందేహాల కోసం ఏర్పాటు చేసిన ఆంటోని కమిటీ హైదరాబాద్ రావడానికి సిద్దంగా ఉందని తెలిపారు. అధిష్టానం కూడా ప్రజల సెంటిమెంటును గుర్తించినట్లుగానే భావిస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు. హైదరాబాద్ ను వదులుకోవడానికి ప్రజలు సిద్దంగా లేరని ఆయన అన్నారు. సమైక్యవాదాన్ని తాను కూడా అదిష్టానం ముందువుంచానని అన్నారు. ఇక విభజన విషయంలో.. ప్రజల అభీష్టం మేరకు తాము వ్యవహరిస్తామని కావూరి స్పష్టం చేశారు.

Exit mobile version