Site icon TeluguMirchi.com

శ్రీరామ్ కు ముందస్తు బెయిల్

paritala-sriram1పరిటాల రవి తనయుడు శ్రీరామ్ కు అనంతపురం జిల్లా కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పరిటాల శ్రీరామ్ తో పాటు మరో ఐదుగురికి ముందస్తు బెయిల్ మంజూరైంది. రూ.25వేల సొంత పూచీకత్తును కోర్టుకు సమర్పించాలని కోర్టు వారిని ఆదేశించింది. శ్రీరామ్ తో పాటు రాఘవేంద్రకు ముందస్తు బెయిల్ మంజూరు కాగా, వడ్డే నాగరాజు, రామకృష్ణ, శ్రీనివాస్ లకు రెగ్యులర్ బెయిల్ మంజూరైంది. కాంగ్రెస్ నేత సుధాకర్ రెడ్డి హత్యకు కుట్ర పన్నారని శ్రీరామ్ పై కేసు నమోదైన విషయంతెలిసిందే.

Exit mobile version