సుప్రీంకోర్టు లో అంబానీ దంపతులు

anil-teena2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు లో పున సమీక్ష పిటిషన్ ను రిలయన్స్ ఏడీఏ గ్రూపు చైర్మన్ అనిల్ అంబానీ, అతని భార్య టీనా అంబానీలు పిటిషన్ దాఖలు చేశారు. వీరు దాఖలు చేసిన పిటిషన్పై విచారణకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. బుధవారం వాదనలు విననుంది. ప్రాసిక్యూషన్ తరఫు సాక్షులుగా తమ ముందు హాజరుకావాల్సిందిగా అనిల్ దంపతులతో పాటు మరో 11 మందిని సీబీఐ కోర్టు శుక్రవారం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వాస్తవాల నిర్ధారణకు వీరి విచారణ అవసరమని తాను భావించినట్లు సీబీఐ ప్రత్యేక జడ్జి ఓపీ సైనీ పేర్కొన్నారు.