తిరుమలలో యువతి పై ఎలుగుబంటి దాడి…!

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ఎలుగుబంటి కలకలం సృష్టించింది. యువతిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనలో యువతి కాళ్లు చేతులకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆమెను అశ్విని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన యువతి తెలంగాణకు చెందిన విజయలక్ష్మీగా పోలీసులు గుర్తించారు.

 

భూగర్భ డ్యాం వద్ద స్నానం చేసి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్లు ఆమె పేర్కొందని తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోందని టీటీడీ ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి వెల్లడించారు.