రోజా కు జగన్ షాక్ ఇచ్చినట్లేనా..?

వైస్సార్సీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నగరి ఎమ్మెల్యే రోజా కు షాక్ ఇచ్చినట్లేనా..అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. వైసీపీ భారీ మెజార్టీ తో గెలుపొందడం.. ఆ పార్టీ తరుపున రెండు సార్లు రోజా ఎమ్మెల్యే గా గెలవడం తో జగన్ మంత్రి వర్గంలో రోజా బెర్త్ ఖాయమని అంత అనుకున్నారు. కానీ జగన్ ప్రకటించిన లిస్ట్ లో ఆమె పేరు లేకపోవడంతో అంత షాక్ లో పడ్డారు. నిన్నటి వరకు రోజా మంత్రి కావడం ఖాయమని అంత ఫిక్స్ అయినా నేపథ్యంలో జగన్ ఇలాంటి షాక్ ఇవ్వడం రోజా అభిమానులను కలవరపెడుతుంది.

అదే జిల్లా నుంచి బలమైన రెడ్డి నేత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి మంత్రి వర్గంలో స్థానం దక్కడంతో రోజాకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. మరోవైపు వై.యస్.జగన్మోహన్ రెడ్డి మరో రెండున్నర ఏళ్ల తర్వాత మరో 25 మంది కొత్తవాళ్లతో మంత్రి వర్గ పునర్వస్తీకరణ చేపట్టే అవకాశం ఉంది. అపుడైన రోజాకు మంత్రి వర్గంలో స్థానం దక్కుతుందా అనేది సందేహంగా మారింది. ఈ విషయంపై రోజా జగన్ ను సంప్రదిస్తుంది కావొచ్చు.