Site icon TeluguMirchi.com

ఏపీ తొలి ఎమ్మెల్సీ ఎవరో తెలుసా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి..ఏపీ తొలి ఎమ్మెల్సీ అభ్యర్థిని ఖరారు చేసారు. హిందూపూర్ అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగి.. ఓటమిపాలైన వైసీపీ నేత ఇక్బాల్‌ను ఎమ్మెల్సీ చేస్తున్నట్లు జగన్ ప్రకటించారు.

పవిత్ర రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం ముస్లింలకు ఇఫ్తారు విందు ఏర్పాటు చేసింది. గుంటూరులోని పోలీసు పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందుకు జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల్లో ఐదుగురు ముస్లింలకు టికెట్లు ఇచ్చాం… నలుగురు గెలిచారు.. హిందూపురంలో మాత్రం ఇక్బాల్ ఓడిపోయారు.. ఆయనకు ఎమ్మెల్సీఇస్తున్నట్లు తెలిపారు.

అలాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కూడా సెటైర్లు వేశారు. 23 మంది ఎమ్మెల్యేలను డబ్బులిచ్చి కొనుగోలు చేసిన టీడీపీకి ఆ దేవుడు రాసిన రాత ఇది 23వ తేదీన ఫలితాల్లో 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారని ఎద్దేవా చేశారు. నాన్న గారి పాలన గుర్తుకు వచ్చేలా నా పాలన ఉంటుందని మరోసారి జగన్ స్పష్టం చేసారు.

Exit mobile version