Site icon TeluguMirchi.com

తిరుపతిలో అమిత్ షాకు చుక్కలు చూపించారు

తిరుపతిలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు చుక్కలు కనబడ్డాయి. తిరుమల వచ్చిన ఆయనకు ప్రత్యేక హోదా సెగ తగిలింది. శ్రీవారి దర్శనం కోసం షా రాకని ముందే తెలుసుకొన్న టీడీపీ కార్యకర్తలు అలిపిరి వద్దకు చేరుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అడుగడుగున అడ్డుకొనే ప్రయత్నం చేశారు. శ్రీవారి భక్తులు కూడా షాని వద్దల్లేదు.

వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదాపై హామిలిచ్చి మరిచిపోయారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన అమిత్ షాకు తిరుమలకు రావడం యేంటన్ని ప్రశ్నిస్తున్నారు. షాని ప్రజలు ఎక్కడ వదల్లేదు. దీంతో ఆయనకు ప్రత్యేక హోదా సెగ ఏ రేంజ్ లో ఉన్నది అన్నది అర్థమై ఉంటుంది. ఫైనల్ గా అమిత్ షాకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతం తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Exit mobile version