సవరణలకు సై.. !!

tbill(3)టీ-బిల్లుపై భాజాపా ప్రతిపాదించిన ప్రధానమైన 6సవరణలు చేయడానికి కాంగ్రెస్ సై అంది. అయితే, భాజాపా కోరుతున్నట్లు రాజ్యాంగ సవరణ ద్వారా కాకూండా, రాత పూర్వక హామి ఇవ్వనుంది. దీనికి కమల నాథులు కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. బిల్లుపై మరిన్ని సవరణలు సూచించరాదని కేంద్రం భాజాపాను బతిమిలాడినట్లు సమాచారం. బిల్లు పై సవరణల విషయంలో ప్రభుత్వ-ప్రతిపక్షాల మధ్య అంగీకారం కుదిరింది. దీంతో.. టీ-బిల్లు రాజ్యసభ ఆమోదం పొందడం కేవలం లాంచయప్రాయంగానే మిగిలింది.