Site icon TeluguMirchi.com

జయప్రద భద్రతపై అమర్ సింగ్ ఆందోళన !

jayaprada-amarsinghప్రముఖ సినీ నటీ, ఉత్తర ప్రదేశ్ రాంపూర్ ఎంపీ జయప్రద భద్రత పట్ల సమాజ్ వాదీ పార్టీ బహిష్కృత నేత అమర్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేకు ఈరోజు ఓ వినతిపత్రం అందజేశారు. ఈ నెల 13న  యూపీ రాష్ట్ర పోలీసులు, రవాణాశాఖ అధికారులు జయప్రద పట్ల దురుసుగా ప్రవర్తించారని, ఆమె కారుపై ఎర్రలైటు కూడా తొలగించారని షిండేకు సమర్పించిన మెమొరాండంలో ఆయన పేర్కొన్నారు. ఈ ఘటన పైన నిష్పాక్షికంగా దర్యాఫ్తు జరపాలని అమర్ సింగ్ హోం మంత్రిని కోరారు. అయితే ఇదే విషయంపై అమర్ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కూడా లేఖ రాసినట్లు తెలుస్తోంది.

 

 

Exit mobile version