Site icon TeluguMirchi.com

అబ్బే…. అన్నీ ఊహాజనిత వార్తలే… !

Digvijay_Singhఇటీవల జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో కేవలం ఇరుప్రాంతాల వారి అభిప్రాయాలు వినటం మినహా ఎటువంటి నిర్ణయాలు గానీ, చర్చలు గానీ జరగలేదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ తెలిపారు. ఈ అంశానికి సంబంధించి స్థానిక నాయకులు చేస్తున్న ప్రకటనలు, మీడియా లో వస్తున్న వార్తలు కేవలం ఊహాజనితాలేనని ఆయన స్పష్టం చేశారు. రాయల తెలంగాణా, హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేయటం, లేదా ఉమ్మడి రాజధాని చేయటం లాంటివన్నీ ఎవరికీ వారు ఊహించుకుని మాట్లాడుతున్నవేనని, ఇవేమీ కోర్ కమిటీ లో చర్చకు కూడా రాలేదని ఆయన చెప్పారు. కోర్ కమిటి తన నివేదికను సి డబ్ల్యు సి కి పంపిందని, సి డబ్ల్యు సి ఈ విషయమై ఒక నిర్ణయం గైకొంటుందని అప్పటివరకు ఇరు ప్రాంతాలవారు సంయమనం పాటించాలని దిగ్విజయ్ విజ్ఞప్తి చేసారు.

Exit mobile version