Site icon TeluguMirchi.com

’సేవ్ ఆంధ్రప్రదేశ్’ కు సర్వం సిద్ధం !

apngosఏపీ ఎన్జీవోలు విజయవాడలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ కు ఏర్పాట్లు పూర్తయినట్లు నిర్వహకులు చెబుతున్నారు. సమైక్యాంధ్ర కోసం ఏపీ ఎన్జీవోలు నిర్వహిస్తున్న సభలో ఇది రెండోది. ఇటీవలే హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఎన్జీవోలు ’సేవ్ ఆంధ్రప్రదేశ్’ పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఈరోజు విజయవాడలో నిర్వహించే సభకు సైతం రాజకీయ నాయకులను ఆహ్వానించక పోవడం విశేషం. ఈ సభ ద్వారా తమ సమైక్య ఆకాంక్షను ఢిల్లీ వరకు వినిపించేలా చేయాలని ఎపీ ఎన్జీవోలు భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే భారీ ఏర్పాట్లు కూడా చేశారు. అయితే, ఈ సభకు భారీ బందోస్తును ఏర్పాట్లు చేసినట్టు నగర డీసీపీ రవిప్రకాశ్ తెలిపారు.

Exit mobile version