Site icon TeluguMirchi.com

‘సకల జన భేరి’ కి సర్వం సిద్ధం

sakanjanula bheriతెలంగాణ రాజకీయ, ప్రజా సంఘాల ఐకాస తలపెట్టిన ‘సకల జన భేరి’ సభకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్ లోని నిజాం కళాశాల మైదానంలో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటలవరకు జరిగే ఈ సదస్సును తెలంగాణ వాదులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఈ మేరకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను నిలిపి వేస్తే తాము ఊరుకోబోమని, సమైక్య రాష్ట్రంలో ఇక ఉండబోమని కేంద్ర ప్రభుత్వానికి చాటి చెప్పడానికి ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. సభ జరిగే ప్రాంగణానికి కాళోజీ ప్రాంగణంగా, వేదికకు ఆచార్య జయశంకర్ వేదికగా నామకరణం చేశారు. ఈ సదస్సుకు లక్షమందికి పైగా తెలంగాణ వాదులు హాజరవుతారని భావిస్తున్నారు.

Exit mobile version