Site icon TeluguMirchi.com

అఖిలపక్ష సమావేశం ప్రారంభం

all-party-meetingతెలంగాణపై ఢిలీలో కేంద్రం నిర్వహిస్తున అఖిలపక్ష సమావేశం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. ఈ భేటికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సహా 8 పార్టీల ప్రతినిధులు నార్త్ బ్లాక్ లోని హోంమంత్రి కార్యాలయానికి చేరుకున్నారు. భేటీ అనంతరం 11.30 కు హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, ప్రతి పార్టీ నుండి కూడా ఇద్దరు ప్రతినిధులు హాజరయినట్టు తెలుస్తోంది.
పార్టీ ప్రతినిధులుగా హాజరైన నేతలు :
కాంగ్రెస్ : కేఆర్ సురేష్ రెడ్డి, గాదె వెంకట రెడ్డి
తెదేపా : యనమల రామకృష్ణుడు, కడియం శ్రీహరి
తెరాస : కేసీఆర్, నాయిని నర్సింహారెడ్డి
వైకాపా : మైసూరారెడ్డి, మహేందర్ రెడ్డి
భాజపా : కిషన్ రెడ్డి, హరిబాబు
సీపీఐ : నారాయణ, గుండా మల్లేష్
సీపీఎం : రాఘవులు, జూలకంటి
ఎంఐఎం : అసరుద్దీన్, జీవీజీ నాయుడు

Exit mobile version