Site icon TeluguMirchi.com

బాబ్లీపై అఖిలపక్ష భేటీ ప్రారంభం !

all-party-meetion-on-babliబాబ్లీ అంశంపై సచివాలయంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో బాబ్లీ ప్రాజెక్టు విషయంలో చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించనున్నారు. ఈ సమావేశానికి మంత్రి సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ విప్ గండ్ర, తెదేపా నుంచి ఎర్రబెల్లి, తుమ్మల, పెద్దిరెడ్డి, తెరాస నుంచి వినోద్, సీపీఐ నుంచి నారాయణ, చాడ వెంకటరెడ్డి, వైకాపా నుంచి గట్టు రామచంద్రరావు, కేకే మహేందర్ రెడ్డి హాజరయ్యారు. అయితే, ఈ సమావేశం మార్చి నెలలోనే నిర్వహించాల్సివుండగా.. అసెంబ్లీ సమావేశాలు, ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం గోదావరి నదిపై  మహారాష్ర్ట పభుత్వం బాబ్లీ ప్రాజెక్టు ను నిర్మించినట్లయితే.. తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారే అవకాశాలున్నాయని ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.

Exit mobile version