హైదరాబాద్ కు అఖిలేష్ !

akhilesh-yadavఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఈరోజు (శనివారం) హైదరాబాద్ కు రానున్నారు. ఈ రోజు హైదరాబాద్ లో జరిగే అఖిలభారత యాదవ మహాసభకు అఖిలేశ్ హాజరుకానున్నారు. ఈ మేరకు సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జగదీష్ యాదవ్ ఓ ప్రకటన చేశారు. ఈ సభ నాగోల్ లోని శుభం గార్డెన్స్ లో జరగనుంది. ఈ సభ ముగిసిన అనంతరం ఈ యువ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుని కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.