ఏసీబీ కస్టడీలోకి రిపుంజయరెడ్డి

Ripunjaya reddyఆదాయానికి మించి ఆస్తులు కలిగిన కేసులో అరెస్టయిన ఏపీపీఎస్సీ మాజీ సభ్యుడు. రిపుంజయరెడ్డిని అవినీతి నిరోధక శాఖ కస్టడీలోకి తీసుకుంది. రిపుంజయరెడ్డిని ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఏసీబీ చేసిన అభ్యర్థన మేరకు పాతబస్తీలోని ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఐదు రోజుల కస్టడీ మంజూరు చేసింది. దీంతో చర్లపల్లి జైల్లో రిమాండ్ లో ఉన్న రిపుంజయరెడ్డిని ఏసీబీ అధికారులు ఈరోజు కస్టడీలోకి తీసుకున్నారు.