జూబ్లీహిల్స్, గాయత్రినగర్లోని సూరీడు నివాసంలో సోదాలు జరిపిన అధికారులు పలు విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అలాగే యూసుఫ్ గూడా, వెంకటగిరిలోని రిపుంజయరెడ్డి ఇంట్లోనూ ఏసీబీ దాడులు జరుపుతోంది. భారీగా నగదు, విలువైన పత్రాలను ఏసీబీ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒక్క యూసుఫ్గూడాలోనే రిపుంజయరెడ్డికి ఆరు ఫ్లాట్లు ఉన్నట్లు ఏసీబీ దాడుల్లో బయటపడింది.