ఉద్యమానికి మద్దతుగా ప్రజలు తరలిరావాలని, నిజాయితీ పోలీసులు సెలవు పెట్టి ఉద్యమించాలని క్రేజివాల్ పిలుపునిచ్చారు. అయితే, ఢిల్లీ పాలనపై ధర్నా ప్రభావం ఏమీ ఉండదని, పాలన యధావిధిగా సాగుతుంది ఆయన అన్నారు. కాగా, ఈరోజు జరగాల్సిన మంత్రివర్గ సమావేశం కూడా దీక్షాస్థలి వద్దే నిర్వహించాలని క్రేజీవాల్ నిర్ణయించినట్లు సమాచారం. ఆమ్ ఆద్మీ ధర్నా దృష్ట్యా ఈరోజు కూడా 4 మెట్రో స్టేషన్లను మూసేశారు. ఒక ముఖ్యమంత్రి తన మంత్రివర్గ సహచరులతో కలిసి రోడ్డుపై ధర్నాకు దిగటం దేశ చరిత్రలో బహుశా ఇదే తొలిసారి.