3యేళ్లలో.. 58క్యాన్సర్ ఆసుపత్రులు : జైరాం

jairam-rameshదేశంలో క్యాన్సర్ ఆసుపత్రుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్ తెలిపారు. వచ్చే 3యేళ్లలో.. 58క్యాన్సర్ ఆసుపత్రులను ఏర్పాటు చేయనున్నట్లు జైరాం తెలిపారు. జార్ఖండ్ లోని పాలాము జిల్లా మేదినీనగర్ లో మంత్రి వంద పడకల క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇంకో 4క్యాన్సర్ ఆసుపత్రులను జార్ఖండ్ లో ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చారు.