Site icon TeluguMirchi.com

టీటీడీ నుంచి 241 కోట్లు రావాలా..?

220px-TTD_logo
రాష్ర్టానికి టీటీడీ నుంచి 241 కోట్లు రావాల్సి ఉందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా దేవాదాయ శాఖకు నిధుల మంజూరు అంశంపై బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్‌ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆలయాల్లో దూప దీప, నైవేద్యాలకు ఎక్కడా లోటు రాకుండా చూస్తున్నామని చెప్పారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన నిధులు కూడా కేటాయించామన్నారు. రాబోయే బడ్జెట్‌లో మరిన్ని నిధులు కేటాయించనున్నట్లు ఆయన వెల్లడించారు.

Exit mobile version