110మంది అరెస్ట్@ విజయనగరం అల్లర్లు

vijayanagaramవిజయనగరం జిల్లాలో జరిగిన ఘర్షణల్లో ఇప్పటివరకు 110 మంది సమైక్యవాదులను అరెస్టు చేసినట్టు జిల్లా ఎస్పీ తెలిపారు. కర్ఫ్యూకు ముందు జరిగిన సంఘటనలపై విచారించేందుకు విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్టు కూడా ఎస్పీ పేర్కొన్నారు. ఈ కమిటీ ఈ రోజు నుంచి విచారణను చేపట్టనుంది. మరోవైపు, జిల్లాలో విధించిన కర్ఫ్యూని పోలీసులు గంటసేపు సడలించారు. ప్రజలు తమ నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసే నిమిత్తం, ఈ రోజు ఉదయం 7నుంచి 8 గంటల వరకు పోలీసులు కర్ఫ్యూ సడలించారు. ఈ సమయంలో ప్రజలు భారీ ఎత్తున రోడ్లపై వచ్చి వారికి కావాల్సిన వస్తువులను కొనుగోలు చేశారు. అయితే, కేవలం గంటపాటే కర్ఫ్యూని సడలించడంతో… ప్రజల్లో హడావుడి నెలకొంది. ఉరుకులు-పరుగులు పెడుతూ ప్రజలు తమకు కావాల్సిన నిత్యవసర వస్తువులను కొనుగోలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. కాగా, కర్య్ఫూ సడలింపు సమయం ముగియగానే ప్రజలు వారి వారి నివాసాలకు వెళ్లాలని పోలీసులు హెచ్చరించారు.