సీఎం కిరణ్ ప్రవర్థన వల్ల దళితులే కాకుండా మైనార్టీలు సైతం కాంగ్రెస్ కు దూరమవుతున్నారని ఆయన అన్నారు. ఇటీవలి కాలంలో ఒవైసె సోదరులను ఇబ్బందులకు గురిచేయడంతో.. మైనార్టీలు కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని శంకర్రావు అన్నారు. గ్రీన్ ఫీల్డ్ భూకుంభకోణంలో పోలీసులు తనపై అక్రమ కేసులు బనాయించారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని శంకర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, గ్రీన్ ఫీల్డ్ భూ కుంభకోణం కేసులో శంకర్రావు నిన్ననే బెయిల్ పై రిలీజ్ అయిన విషయం తెలిసిందే.