Site icon TeluguMirchi.com

పోలీసులు దిగొచ్చారు !

kjreevalఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ధర్నా విరమించారు. పోలీసుల తీరును నిరసిస్తూ నిన్న ఉదయం నుండి ఢిల్లీలో మెట్రోరైల్ భవన్ దగ్గర ధర్నా చేస్తున్నారు. కేజ్రీవాల్ ధర్నా కు ఢిల్లీ పోలీసులు దిగివచ్చారు. నిర్లక్ష్యంగా ఉన్నారని కేజ్రీవాల్ ఆరోపిస్తున్న పోలీసులు దీర్ఘకాలిక సెలవు పై వెళ్లాలని అధికారులు ఆదేశించారు.

ధర్నా విరమణ సందర్భంగా కేజ్రీవాల్ ఢిల్లీ పోలీసులపై పలు ఆరోపణలు చేశారు. పోలీసుల వైఫల్యం వల్లే ఢిల్లీలో మహిళలకు రక్షణ కరువైందని అన్నారు. ప్రజల రక్షణకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని, అందుకే తమ చేతుల్లో లేని అంశం గురించి ఉద్యమించామని ఆయన తెలిపారు. పోలీసులపై విజయం ఢిల్లీ ప్రజల విజయమని ఆయన అభివర్ణించారు.

Exit mobile version