Site icon TeluguMirchi.com

తెలంగాణకు బీజం వేసింది సోనియా కాదు.. వైఎస్సే !

VH-Hanumantharaoకాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు వైఎస్సార్సీపీ అధినేత జగన్ పై మండిపడ్డారు. హైదరాబాదులో ఆయన మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణవాదానికి బీజం వేసింది సోనియా గాంధీకాదని .. వైఎస్సార్ అన్న సంగతి జగన్ గ్రహించాలని ఎంపీ వీహెచ్ హితువు పలికారు. చంద్ర బాబును అధికారంలోనుంచి దించేందుకే వైఎస్ తెలంగాణను తెరపైకి తీసుకొచ్చారని ..అప్పుడు జగన్ అతన్ని ఎందుకు నిలదీయలేదని ఆయన ప్రశ్నించారు. మరోవైపు జాతీయ గీతం కూడా పాడరాని జగన్ పార్టీ నాయకులు సమైక్యవాదాన్ని వినిపిస్తున్నారని ఆయన విమర్శించారు. సభలో జై తెలంగాణ అన్న వారిని కొట్టినప్పుడు అది సమైక్యసభ ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు.
అయితే, చంద్రబాబును అధికారంలోనుంచి దించేందుకే వైఎస్ తెలంగాణను తెరపైకి తీసుకొచ్చారన్న వి.హెచ్ వ్యాఖ్య కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాల్ని బయటపెడుతుంది.

Exit mobile version