Site icon TeluguMirchi.com

ఉభయ సభలు వాయిదా!

lok-sabha_398_080911043849తెలంగాణ బిల్లు పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేస్తోంది. లోక్ సభ ప్రారంభం కాగానే సీమాంధ్ర, తెలంగాణ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జై తెలంగాణ నినాదాలతో తెలంగాణ నేతలు, జై సమైక్యాంధ్ర నినాదాలతో సీమాంధ్ర నేతలు సభను మార్మోగించారు. దీంతో.. స్వీకర్ మీరాకుమార్ సభను 12గంటలకు వాయిదా వేశారు. ఇటు రాజ్యసభలోనూ సేమ్ పరిస్థితి నెలకొంది. కాగా, సమావేశాలు ప్రారంభంకాగానే ఉభయ సభల్లో సభ్యులు ఇటీవల చనిపోయిన మాజీ సభ్యులకు సంతాపం తెలిపారు.

Exit mobile version