Site icon TeluguMirchi.com

ఇంట్లో దీక్ష చేసినవారు బాబు దీక్ష పై మాట్లాడతార ?!

somireddyఇంట్లో కూర్చుని దీక్ష చేసిన వారికి చంద్రబాబు దీక్ష పై మాట్లాడే హక్కు వుందా ? అని ప్రశ్నించారు టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. చంద్రబాబు ఢిల్లీ దీక్షపై విమర్శలు గుప్పిస్తున్న వైఎస్సార్సీపీకి సోమిరెడ్డి దీటుగా బదులిచ్చారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. జగన్ తెలుగుజాతి కోసం ప్రాణాలర్పిస్తానంటున్నారని, ఆయనేమన్నా పొట్టి శ్రీరాములా..? అని ప్రశ్నించారు. ఇంట్లో కూర్చుని దీక్ష చేసిన వారికి బాబును విమర్శించే హక్కు లేదని స్పష్టం చేశారు. బాబు ఢిల్లీలో ఎండలోనూ, వర్షంలోనూ దీక్ష కొనసాగించారని సోమిరెడ్డి వివరించారు. జగన్ పిలుపుతో అక్టోబర్ 2న దీక్ష చేపట్టిన వైఎస్సార్సీపీ నేతలు ఆ మర్నాడే దీక్ష విరమించారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ తో కుమ్మక్కయిన జగన్ ఆ పార్టీపైనే పోరాడతాననడం హాస్యాస్పదమన్నారు.

Exit mobile version