శబరిమల ఆడవారి ప్రవేశం ఫై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ..

శబరిమల అయ్యప్ప ఆలయం లో ఆడవారి ప్రవేశం ఫై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అన్ని వయసుల మహిళలకు శబరిమల ఆలయంలోకి ప్రవేశం కల్పిస్తూ శుక్రవారం తీర్పు వెల్లడించింది. దేవతలను పూజిస్తూ, మహిళలను గౌరవించకపోవడం సరికాదని, 4-1 తేడాతో ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పును వెల్లడించింది. ఈ తీర్పు తో మహిళా సంఘాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

మరోవైపు శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సుప్రీం తీర్పును కేరళ ప్రభుత్వం, ట్రావెన్‌కోర్ దేవస్వామ్ బోర్డ్ స్వాగతించగా, పందళ రాజ కుటుంబంసహా వివిధ హిందూ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి.