Site icon TeluguMirchi.com

గోడ కూలి…ఐదుగురు దుర్మరణం

moulaliకుండపోతగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ నగరంలోఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. మౌలాలీలోని ఎంజే కాలనీలో పురాతన గోడ ఒకటి కూలి పక్కనే ఉన్న గుడిసెలపై పడిపోయింది. గుడిసెల్లో నిద్రిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. వీరంతా మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల నుంచి పొట్ట కూటి కోసం నగరానికి వచ్చిన రోజు కూలీలు. మృతులను పద్మ, మహదేవ్, అనిల్, శివ, వెంకటయ్యగా గుర్తించారు. శిధిలాల కింద ఉన్న ముగ్గురిని రక్షించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాల్సిందిగా ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలను అన్నివిధాలా ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు.

Exit mobile version