విరాట్ వీర కొట్టాడు .. 35వ సెంచరీ

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ వన్డేల్లో 35వ సెంచరీ బాదాడు. 82 బంతుల్లో 17 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఆరో వన్డేలో 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాను కెప్టెన్‌ కోహ్లీ విజయం దిశగా నడిపిస్తున్నాడు.

మొదట బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా.. భారత్‌ బౌలర్ల ధాటికి 204 పరుగులకే కుప్పకూలింది. మార్క్‌రమ్ 24, ఆమ్లా 10, డివిల్లియర్స్ 30, జోండో 54, క్లాసేన్ 22, బెహర్డైన్ 1, మార్రీస్ 4, ఫెహ్లుక్వాయో 34, మార్కెల్ 20, తాహిర్ 2 , ఎన్గిడి 0 (నాటౌట్) పరుగులు చేశారు. బౌలర్లు సమష్టిగా రాణించడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 50ఓవర్లలో 204పరుగులకే ఆలౌట్‌ అయింది.