విరాట్ విధ్వంసకాండ

Virat_Kohliఆస్ట్రేలియాతో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో భారత్ అదరగొట్టింది. 6వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. 351 పరుగుల భారీ లక్ష్యాన్ని ధోనీసేన మూడు బంతులు మిగిలుండగా ఛేదించింది. కోహ్లీ విధ్వాంస కాండ, శిఖర్ దావన్, రోహిత్ శర్మ సూపర్ ఇన్నింగ్స్ తో ఆసీస్ విధించిన భారీ లక్ష్యం చిన్నబోయింది. కోహ్లీ కేవలం115 (66బంతుల్లో )నాటౌట్, శిఖర్ 100 (102బంతుల్లో) చేసి తమ సూపర్ ఫామ్ ని కంటిన్యూ చేశారు. దీంతో భారత్ సిరీస్ ను 2-2తో సమం చేసింది. ‘సెంచరీ చేసిన కోహ్లీ మ్యాన్ ఆఫ్‌ ద మ్యాచ్ గా ఎంపికయ్యాడు.