Site icon TeluguMirchi.com

ముజ’ఫైర్’నగర్@ 26మంది మృతి

muhafarఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా మత ఘర్షణలతో అట్టుడుకుతోంది. ఈ మత ఘర్షణలు, అల్లర్లలో మరణించినవారి సంఖ్య 26కి చేరింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం భారీగా బలగాలు మోహరించింది. అయినా అల్లర్లు అదుపులోకి రావడం లేదు. జిల్లాలోని సివిల్ లైన్స్, కొత్వాలి, నైనీ మండి ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. సమస్యాత్మక ప్రాంతాల్లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్, పోలీసు, పీఏసీ బలగాలు కవాతు చేశాయి.

Exit mobile version