Site icon TeluguMirchi.com

జ‌న చైత‌న్య ర్యాలీ చేపట్టబోతున్న నారారోహిత్

Vanam-kosam-manamవిభిన్న‌మైన చిత్రాల్లో న‌టిస్తూ న‌టుడుగా ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తెచ్చుకున్న హీరో నారా రోహిత్ సినిమాల‌కే ప‌రిమితం కాకుండా సామాజిక సేవ‌లో కూడా భాగ‌మ‌వుతున్నారు. ఆనంత‌పురంలో ఎ.బి.ఎన్‌.ఆంధ్ర‌జ్యోతి చానెల్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న వ‌నం కోసం మ‌నం అనే కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌ర‌వుతున్నారు.

ఈ మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మం ఎన్.బి.కె.హెల్పింగ్ హ్యాండ్ఆ జ‌గ‌న్ ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతుంది. జూలై 3 ఉద‌యం 9 గంట‌ల‌కు ఈ జ‌న చైత‌న్య ర్యాలి ట‌వ‌ర్ క్లాక్ నుండి ఎన్‌.టి.ఆర్ విగ్ర‌హం వ‌ర‌కు ఈ ర్యాలి జ‌రుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వామ్యులు కావాలని నిర్వాహకులు కోరుతున్నారు.

Exit mobile version