అక్టోబర్ 5 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

utsavamsmainఅక్టోబర్ 5 నుంచి 13 వరకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. 9న గరుడోత్సవం, 12న రధోత్సవం, 13న చక్రస్నాన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈరోజు (బుధవారం) ఉదయం శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్‌ ను టీడీపీ చైర్మన్ కనుమూరి బాపిరాజు ఆవిష్కరించారు. అయితే, ఎప్పుడూ లేని విధంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఈసారి సమైక్య సెగ తగలనుంది. భక్తులు మాత్రం ప్రభుత్వం కలుగజేసుకుని ఉత్సవాలు ముగిసే వరకు తిరుమల, తిరుపతిలలో ఆందోళనలు విరమింపజేయాలని కోరుతున్నారు.