Site icon TeluguMirchi.com

భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ టై!!

tieభారత్-న్యూజిలాండ్ ల మధ్య అక్లాండ్ లో జరుగుతున్న మూడో వన్డే టై అయింది. మొదటి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 314పరుగుల వద్ద ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ 9 వికెట్లు నష్టపోయి సరిగ్గా 314 పరుగులు చేసింది. దీంతో.. మ్యాచ్ టై గా ముగిసింది. ఓ దశలో 130పరుగులకే నాలుగు ప్రధాన వికెట్లను కోల్పోయిన భారత్ ను ధోని 50, అశ్విన్ 65(46 బంతుల్లో), జడేజా 66(45 బంతుల్లో) విజయానికి దగ్గర తీసుకువచ్చారు. అయితే, కీలక సమయంలో టీం-ఇండియా వికెట్లను కోల్పోవడంతో.. చివరకు మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో.. 5 వన్డేల సిరీస్ న్యూజిలాండ్ 2-0 ఆధిక్యంలో నిలిచింది.

Exit mobile version