Site icon TeluguMirchi.com

హెచ్చరిక : దేశంలోకి చొరబడ్డ ఉగ్రవాదులు

దేశంలోకి ఉగ్రవాదులు ప్రవేశించారన్న ఇంటిలిజెన్స్ హెచ్చరికల పోలీసులు అప్రమత్తం అయ్యారు. దేశంలోకి 21 మంది ఉగ్రవాదులు ప్రవేశించారని ఇంటిలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ముంబై, ఢిల్లీ టార్గెట్‌గా దాడులు జరిగే అవకాశాలున్నాయి. మెట్రో స్టేషన్లు, హోటళ్లను టార్గెట్‌ చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

తాజా హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. దేశంలోని ప్రధాన నగరాలలో తనీఖీలు తీవ్ర తరం చేశారు. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని, ముఖ్యమైన ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నారు.

ఇంటిలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు పోలీసులకి సహకరించడంతో పాటు.. స్వీయ అప్రమత్తంగా ఉంటే మంచిందని సూచిస్తున్నారు. ముంబై, దిల్ సుఖ్ నగర్ లాంటి దాడులు పునరావుతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకొంటున్నారు.

Exit mobile version