షిర్టీలో ఘోరరోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మన రాష్ట్రానికి చెందిన గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన ఒకే కుటుంబానికి చెందిననలుగురు మృత్యువాత పడ్డారు. వీళ్లు నరసరావుపేట నుంచి రైల్లో నాగర్ సోల్ చేరుకుని, అక్కడి నుంచి షిర్డీ వెళ్లేందుకు టాక్సీ ఎక్కారు. ఎక్కిన కొద్ది సేపటికే వీళ్ల టాక్సీపై చెట్టు పడింది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించినట్లు తెలుస్తోంది. వీరిలో ముగ్గురు మహిళలు, ఒక బాలిక ఉన్నట్లు సమాచారం. మృతదేహాలను శవపరీక్షలకు తరలించి బంధువులకు సమాచారం అందించామని ఇన్ స్పెక్టర్ పాటిల్ తెలిపారు.