ఆధార్తో మొబైల్ నంబర్, బ్యాంక్ అకౌంట్ల అనుసంధానం డెడ్లైన్ను నిరవధికంగా పొడిగించింది సుప్రీంకోర్టు. దీనిపై ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పును వెలువరించే వరకు డెడ్లైన్ అంటూ ఏమీ ఉండదని స్పష్టంచేసింది
ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం ఈ తీర్పు వెలువరించింది.
పలు సంక్షేమ పథకాలు, సేవలకు ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేస్తూ గతేడాది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆధార్ అనుసంధానం విశ్వసనీయం కాదని పేర్కొంటూ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ విషయంపై తాజాగా మరోసారి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఆధార్ గడువును నిరవధికంగా పొడగించింది.