Site icon TeluguMirchi.com

చెపాక్ లో చెన్నై విజయం

bravoచెన్నై-రాజస్థాన్ జట్ల మధ్య చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ ప్రేక్షకులకు కనువిందు చేసింది. ఐపిఎల్ -6లో రాజస్థాన్ బ్యాట్స్ మెన్ వాట్సన్ మొదటి సెంచరి నమోదు చేయడంతో.. 185 భారీ లక్ష్యాన్ని చెన్నై ముందు వుంచింది. అయితే.. చెన్నై బ్యాట్స్ మెన్ మైకెల్ హస్సీ 88 బంతుల్లో 101 పరుగులతో చెన్నై గెలుపులో కీలక పాత్ర పోషించాడు. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 4 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన చెన్నై మొదటి నుండి దూకుడుగా ఆడుతూ.. వచ్చింది. అయితే ఆఖరి ఓవర్లో 11 పరుగులు అవసరం కాగా బ్రేవో అద్భుతమైన సిక్స్ కొట్టి చెన్నై ని విజయ తీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్ తిలకించడానికి వచ్చిన ప్రేక్షకులకు టికెట్ ధరకు డబుల్ వినోదాన్ని అందించిందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. అవును మరీ.. ఫోర్లు, సిక్సర్లతో స్టేడియం హోరెత్తిపోతుంటే.. డబుల్ వినోదమే..!

 

Exit mobile version