Site icon TeluguMirchi.com

ప్లే ఆఫ్ కు చేరిన సన్ రైజర్స్ !

sunrisers-hydసన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆప్ కు దూసుకెళ్లింది. ఐపీఎల్ ఆరో సీజన్ లో అనామక జట్టుగా దిగిన సన్ రైజర్స్.. హేమా హేమీ జట్లను వెనక్కి నెట్టి పే ఆఫ్ కు అర్హత సాధించింది. ఉప్పల్ స్టేడియంలో ఆదివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో కోల్ కత నైట్ రైడర్స్ ను ఓడించింది. దీంతో.. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టును వెనక్కినెట్టి సన్ రైజర్స్ ప్లే ఆఫ్ కు దూసుకెళ్లింది. మొదటి బ్యాటింగ్ చేసిన కోల్ కత ౨౦ ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. కలిస్ 24, యూసుఫ్ పటాన్ 49 నాటౌట్ చెప్పుకోదగ్గ స్కోర్ నమోదు చేశారు. సన్ రైజర్స్ బౌలర్లలో స్టెయిన్ కు 2, రాజన్, పెరీరా, మిశ్రా, కరణ్ శర్మ తలో వికెట్ తీసుకున్నారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ మరో ఏడు బంతులు మిగిలిఉండగానే 5వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. హైదరాబా బ్యాట్స్ మెన్ల్ లో పార్థివ్ పటేల్ 47, ధావన్ 72, సామి నాటౌట్ 17 పరుగులు చేశారు. కోల్ కత బౌలర్లలో అబ్దుల్లా 3, అహ్మద్ ఒక వికెట్ తీసుకున్నారు. అమిత్ మిశ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.

Exit mobile version