Site icon TeluguMirchi.com

ప్లే ఆఫ్ కు చేరువైన సన్ రైజర్స్ !

sunrisers-hydరాజస్తాన్ రాయల్స్ పై విజయంతో.. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్లే ఆఫ్ కు మరింత చేరువైంది. ఉప్పల్ స్టేయడియంలో శుక్రవారం జరిగిన కీలకమైన మ్యాచ్ లో హైదరాబాద్ 23 పరుగుల తేడాతో రాజస్థాన్ ను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 9 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. 5 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన… సమంత్రయ్ 55 (46బంతుల్లో) పరుగు చేయడం ద్వారా హైదరాబాద్ ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ 9 వికెట్లు కోల్పోయి 113 పరుగులు మాత్రమే చేయగలిగింది. హైదరాబాద్ బౌలర్లలో అమిత్ మిశ్రా, స్టెయిన్, పెరీరా తలో రెండు వికెట్లు తీసుకున్నారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అమిత్ మిశ్రా కు లభించింది.

Exit mobile version