అక్టోబర్ 5నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు !

ttdఅక్టోబర్ 5 నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు టీటీడీ ఈవో ఎంజీ గోపాల్ ఓ ప్రకటన చేశారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తిరువాడ వీధుల్లో 1.5లక్షల మందికి సరిపడే విధంగా గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నట్లు ఈవో తెలిపారు. తిరుమల బ్రహ్మోత్సవాలను దృష్టిలో వుంచుకొని తిరుపతిలో బంద్ కు ఏపీ ఎన్జీవోలు మినహాయింఫు ఇస్తారనే ఆశాభావాన్ని ఈవో వ్యక్తం చేశారు. అదేవిధంగా.. తిరుమలకు అదనపు బస్సులు ఏర్పాటు చేయమని ఆర్ టీసీని కోరినట్లు ఈవో వెల్లడించారు.