భారత్ కు షాక్.. లంక గెలుపు


ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా ఇక్కడ జరిగిన ఆరంభపు మ్యాచ్‌లో టీమిండియాకు శ్రీలంక షాకిచ్చింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో లంక జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలుపును అందుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవ‌ర్లలో ఐదు వికెట్ల న‌ష్టానికి 174 ప‌రుగులు చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్‌ నాలుగో బంతికే పరుగులేమీ చేయకుండానే రోహిత్‌ శర్మ (0) ఔటయ్యాడు. ఆ తర్వాత 9 పరుగుల వద్ద సురేశ్‌రైనా ఫుల్‌టాస్‌ బంతికి వికెట్‌ పారేసుకున్నాడు.ఐతే మనీశ్‌ పాండే (37)తో కలిసి శిఖర్‌ ధావన్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఒత్తిడిలో పడ్డ జట్టును శిఖర్‌ ధావన్‌ (90; 49 బంతుల్లో) తో అదరగొట్టాడు.

భారత్‌ విసిరిన 175 పరుగుల లక్ష్య ఛేదించే క‍్రమంలో లంక జట్టు కుశాల్‌ మెండిస్‌(11) వికెట్‌ను ఆదిలోనే కోల్పోయింది. ఆ తర్వాత కుశాల్‌ పెరీరా, గుణతిలకా జోడి లంక స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. కుశాల్‌ పెరీరాలు అవుటైన తర్వాత మ్యాచ్‌పై భారత్‌ పట్టుబిగించినట్లే కనబడింది. కాగా, చివరి ఓవర్లలో షనకా, తిషారా పెరీరాలు బ్యాట్‌ను ఝుళిపించడంతో లంక జట్టు 18.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.