Site icon TeluguMirchi.com

విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు !

vijayawadaరాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు సమ్మె బాట పట్టడంతో.. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. విజయవాడ నుంచి మచిలీపట్నం, గూడూరు, గుంటూరులకు ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.

ప్రత్యేక రైళ్ల టైమ్ టేబుల్ క్రింది విధంగా వున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఉదయం – 10గంటలకు : విజయవాడ – గుంటూరు మధ్యాహ్నం 12.30 గంటలకు విజయవాడ-గూడూరు, 6.30 గంటలకు విజయవాడ-మచిలీపట్నం.

Exit mobile version