నేటి నుంచి సఫారీలతో రెండో టెస్ట్!

dhoni-smithసఫారీలతో జరిగిన మొదటి టెస్ట్ లో సత్తాచాటింది టీంఇండియా. ఇక,  రెండో టెస్ట్ కోసం డర్బన్ లో ఢీకొననుంది. ఈరోజు మధ్యాహ్నం 2గంటల నుండి ప్రారంభమయ్యే ఈ టెస్ట్ కు రెండు జట్లు విజయమే ధ్యేయంగా బరిలోకి దిగుతున్నాయి. సఫారీ గడ్డపై సిరీస్ సాధించి.. సీనియర్స్ లేని లోటును తీర్చాలని టీం-ఇండియా భావిస్తోంది. మరోవైపు, గ్రేట్ ఆల్ రౌండర్ కలిస్ కు విక్టరీతో వీడ్కొల్ పలకాలని సఫారీలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. రెండో టెస్ట్ మరింత రసవత్తరంగా సాగనుందనుంది.